
Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఆగస్టు 31, త్రినేత్రం న్యూస్. 22A – “మా భూమి మా హక్కు” డిబేట్ షోలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు తో కలిసి దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని 22A భూముల సమస్యలు, భూ హక్కులు, రైతులు మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా భూమిపై హక్కు కలిగి ఉన్న ప్రజలకు న్యాయం జరగాలని, 22A జాబితాలో ఉన్న భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి బాధితులకు భూ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.ప్రజల భూ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe