పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొనడంతో దుర్ఘటన
ప్రమాదంలో రెన్ఫే రైలు డ్రైవర్ కూడా మృతి
ప్రమాద కారణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం
Trinethram News : స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు హై-స్పీడ్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న దుర్ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మంది గాయపడ్డారు. దేశ దక్షిణ ప్రాంతంలోని కొర్డోబా ప్రావిన్స్లో ఆదివారం సాయంత్రం ఈ విషాదం జరిగింది.
మాలాగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న ‘ఇర్యో’ అనే ప్రైవేట్ హై-స్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పింది. దాని వెనుక బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్పైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో ఆ ట్రాక్పై మాడ్రిడ్ నుంచి హుయెల్వా వెళ్తున్న ప్రభుత్వ రంగ ‘రెన్ఫే’ రైలు వేగంగా వచ్చి పట్టాలు తప్పిన ఇర్యో రైలు బోగీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెన్ఫే రైలు డ్రైవర్ కూడా మృతి చెందాడు.
కొర్డోబా ప్రావిన్స్లోని అడముజ్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే ఆధునికీకరించిన ట్రాక్పై ఈ దుర్ఘటన జరగడం “చాలా వింతగా ఉంది” అని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటె వ్యాఖ్యానించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవల బృందాలు, సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రమాదం కారణంగా మాడ్రిడ్-అండలూసియా మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


