Trinethram News : Jun 28, 2025, జాతీయ రహదారులపై వాహనాల్లో ప్రయాణించే వారు అతి తక్కువ టోల్ రుసుమును వసూలు చేసే దారి ఏదో తెలుసుకునేలా ‘రాజ్మార్గ్ యాత్ర’ యాప్లో త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై కసరత్తు చేస్తోంది. గమ్యస్థానానికి 2, 3 మార్గాలు ఉంటే ఏయే రూట్లలో ఎంత టోల్ పడుతుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా రోడ్ కండీషన్స్, సదుపాయాలు, ఎమర్జెన్సీ సర్వీసెస్ వివరాలను తెలుసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


