Shashi Prabhanjanam : పదవ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో శశి ప్రభంజనం

TRINETHRAM NEWS

తేదీ : 08/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కామవరపుకోట మండలం, తాడిచర్ల గ్రామంలో ఉన్నటువంటి శశి ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాల మరియు కళాశాల లో ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు వ పబ్లిక్ పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించింది. పదవ తరగతి ఫలితాల్లో మొత్తం ఆరు వందల మార్కులకు గాను సంకుల. రేఖ శ్రీ ఐదు వందల తొంబై ఐదు మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.
అయితే పదవ తరగతిలో మొత్తం విద్యార్థులు నూట ఇరవై ఎనిమిది మంది. పబ్లిక్ పరీక్షలు వ్రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఐదు వందల కు పైగా మార్కులు పరీక్ష రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కూడా శశి కళాశాల ప్రభంజనం సృష్టించింది.
ఇంజవరపు. నవ్య శ్రీ మొత్తం వేయి మార్కులు కు గాను తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి రికార్డ్ తిరగ రాయడం జరిగింది. మొత్తం విద్యార్థిని విద్యార్థులు నూట నలబై మూడు మంది పబ్లిక్ పరీక్షలు వ్రా యగా అందరూ ఉత్తీర్ణత సాధించడం జరిగింది. పదవ తరగతి మరియు ఇంటర్ ఫలితాలలో శశి పాఠశాల మరియు కళాశాల ప్రభంజనం సృష్టించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా వారికి అభినందనలు తెలపడం జరిగింది. క్రమశిక్షణ మరియు సమయపాలన ఆధారంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి ప్రతిభను గుర్తించి విజయాన్ని సాధించడం గొప్ప విశేషంగా చెప్పుకోదగ్గ విషయం. ఐ ఐ టి అకాడమీ కూడా ఉంది అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు 91332,45599 91337,45599. ఉత్తీర్ణత వంద శాతం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Shashi Prabhanjanam in 10th class

You cannot copy content of this page

Scroll to Top