త్రినేత్రం న్యూస్, జనవరి 23, మండపేట ఏడిద రోడ్డులో వేంచేసియున్న శ్రీ పాపమ్మ పేరంటలమ్మ తల్లి అమ్మవారిని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి శుక్రవారం దర్శించుకొని విశేష పూజలు చేశారు.ఏడిద రోడ్డులో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకొని,భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.
సత్యశ్రీ రోడ్ లో వేంచేసియున్న శ్రీ కనక దుర్గ గణపతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం 20వ వార్డు వైస్సార్ కాలనీ లో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ వరాల సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


