TRINETHRAM NEWS

Lions Club distributed school bags to students on Independence Day

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షులు పి మల్లికార్జున్
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ లయన్స్ భవన్, సరస్వతి శిశు మందిర్, లక్ష్మిపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలో వేరు వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం పీకే రామయ్య కాలనీ మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. వాసవ్య విద్యాలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వి ఎల్లప్ప, సీనియర్ లయన్ సభ్యులు ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, కె రాజేందర్, బంక రామస్వామి, డాక్టర్ వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ళ రవీంద్ర చారి, తానిపర్తి గోపాల్ రావు, తిలక్ చక్రవర్తి, కోలేటి శ్రీనివాస్, పోకల ఆంజనేయులు, మనోజ్ కుమార్ అగర్వాల్, ఎల్ బిక్షపతి, గుండ రాజు, రాజేశ్వర్ రావు, ఏ సత్యనారాయణ, ఎల్ వెంకటరమణారెడ్డి, తానిపర్తి విజయలక్ష్మి, బంక కళావతి, మనిషా అగర్వాల్, ఉమారాణి, రంగమ్మ తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lions Club distributed school bags to students on Independence Day