
Fake Currency Racket : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : నాగర్కర్నూల్లో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నకిలీ నోట్ల వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులతో పరిచయం పెంచుకుని, రూ.80 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లను తెప్పించి స్థానికంగా చలామణి చేశారు.
వైన్ షాప్లో క్యాషియర్ నకిలీ నోటును గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిజినపల్లి పోలీసులు మంగనూరులోని ఓ ఇంట్లో నకిలీ నోట్ల ప్రింటింగ్ స్థావరాన్ని గుర్తించి, ప్రింటింగ్ యంత్రాలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe