Penumuru News : ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు తీరడం లేదు- శ్రీనివాసులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ పెనుమూరు.ప్రభుత్వాలు మారిన రైతుల కష్టాలు మారవు ఎందుకు అంటే రైతు కి సహజవనరులు ( పర్యావరణం ) సహకరించి పంటను పండిస్తే వాటికీ కావాలిసిన ఎరువులు కోసం ముఖ్యం గా యూరియా మండలం లో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం తో ప్రవేటు యాజమాన్యం కు సహకరిస్తూ 265 రూపాయల బస్తాను గతం లో 350 రూపాయలు వరకు అమ్మకాలు చేసారు.

ప్రస్తుతం ఒక యూరియా బ్యాగ్ కి అవసరం వున్నా లేకున్నా DAP, కాంప్లెక్స్, లేకపోతే ఆవుల ఫీడ్ అలాకాకపోతే 1500 రూపాయలు పైగా అవసరం వున్నా లేకున్నా ఒక యూరియా బస్తా కోసం అవసరం లేని మందులు ప్రవైట్ యాజమాన్యం రైతులకి అంట కట్టి అమ్మకాలు పెనుచుకోవడం కోసం రైతులను చాలా ఇబందులు పెడుతున్నారు.

ఇంకొకటి ఏమిటి అంటే యూరియా కొరతను సృష్టించి కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత ను ప్రజలలో పెంచుతున్నారు.రాష్టస్థాయిలో రైతుల కోసం CM చంద్రబాబు నాయుడు, మరియు dycm పవన్ కళ్యాణ్ కొన్ని కోట్లు ఖర్చుపెట్టి పథకాలను అమలు చేస్తుంటే మరి మండలం లో వ్యవసాయఅధికారులు ఏమి చేస్తురాని?

ప్రవైట్ వ్యక్తులు కోసమా మీరు పని చేస్తుంది లేకపోతే ప్రజల కోసమా? ఎక్కడ ఇచ్చారండి యూరియా తీసుకోవాలి అంటే అవసరం వున్నా లేకున్నా మిగిలిన ఎరువులు తీసుకోవాలి అనీ? జిల్లా స్థాయిలో యూరియా కొరత లేదు అనీ మన కలెక్టర్ చాలా సార్లు పత్రిక ప్రకటన చేసారు మరి మండలం లోని రైతులకు ఎందుకు యూరియా కొరత సృష్టిస్తున్నారు..దీని పైన వ్యవసాయం సంబంధిత అధికారులు ఏవిధంగా చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.. ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం.

ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది.దీని పైన సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నాము…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

difficulties of farmers do not end

You cannot copy content of this page

Scroll to Top