వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఎమ్మెల్యే సత్యానందరావు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, త్రినేత్రం న్యూస్, కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సందర్శించారు.ముందుగా ఇరువురు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఆలయ మరియు దేవస్థానం ప్రాగణంలోని వసతులను,సేవలను పరిశీలించారు.మాస్టర్ ప్లాన్ రూపకల్పన కృషి చేస్తున్నట్టు తెలిపారు.మరింత మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రామచంద్రమోహన్,ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


