ఏలూరు జిల్లా : మార్చి 2: (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చునుబండ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యదర్శి ఎ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చునుబండ, సూరంపాలెం, కృష్ణారావులపాలెం లో సుమారుగా సొసైటీ నుండి ఐదు వందల ఇరువై ఐదు మంది రైతులు ఉన్నారని తెలిపారు.
అదేవిధంగా వాళ్లందరికీ సకాలంలోనే బ్యాంకు రుణాలు, సంబంధిత ఎరువులు ఇచ్చామని అన్నారు. పంటలు మొక్కజొన్న, వరి, పత్తి మొదలైనవి పండించారని పేర్కొన్నారు. సిబ్బంది నలుగురు ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


