Trinethram News : భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ.. కాల్పుల విరమణను ధ్రువీకరించిన ఇరు దేశాలు.. కాల్పుల విరమణకు అంగీకరించాం-విక్రమ్ మిస్రీ.. మ.3:35 గంటలకు పాక్ డీజీఎంవో.. భారత డీజీఎంవోకు ఫోన్ చేశారు-మిస్రీ
ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి .. సా.5 గంటల నుంచి కాల్పుల విరమణ-మిస్రీ.. 12న సా.5 గంటలకు DGMOల మధ్య మళ్లీ చర్చలు-మిస్రీ .. అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో కీలక ప్రకటన.. తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయి. తటస్థ వేదికపై చర్చలు ప్రారంభించేందుకు నిర్ణయించాయి. శాంతిమార్గాన్ని ఎంచుకున్న మోదీ, షరీఫ్కు అభినందనలు.
మోదీ, షరీఫ్, జైశంకర్, అజిత్ దోవల్తో.. 48 గంటలుగా JD వాన్స్, నేను చర్చలు జరిపాం-రూబియో. దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే -కల్నల్ సోఫియా ఖురేషి.. భారత్ దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయింది. ఎస్-400ను ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం. పాక్ చెప్పినట్టు భారత ఆర్మీకి ఎక్కడా నష్టం జరగలేదు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేస్లను ధ్వంసం చేసింది
-కల్నల్ సోఫియా ఖురేషి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


