
War Effect : త్రినేత్రం న్యూస్ : ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉండగా, తాజాగా ప్రపంచంలో అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారుగా ఉన్న చైనా జెట్ ఇంధనం, డీజిల్, యూరియా వంటి ఎరువుల ఎగుమతులపై పలు ఆంక్షలు విధిస్తోంది. షాన్గాంగ్ ప్రావిన్స్లోని కొన్ని ఎరువుల తయారీ సంస్థలకు ప్రభుత్వం ఎగుమతులు నిలిపివేయమని ఆదేశాలు జారీ చేసింది.
దీనివల్ల ఎరువుల కొరతతో పాటు ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, వియత్నాం వంటి దేశాలపై దీని ప్రభావం పడి, కొన్ని యూరియా ప్లాంట్లు మూతపడే పరిస్థితులు ఏర్పడినట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

