Minister Piyush Goyal : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్

TRINETHRAM NEWS

Trinethram News : భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 18 శాతానికి తగ్గిస్తుంది.. కొన్ని రంగాల్లో సున్నాశాతం సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయి.. ఆర్గానిక్ కెమికల్స్, హోమ్‌డెకర్, యంత్రాల ఎగుమతులకు గొప్ప అవకాశం.. అమెరికాకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్‌లో సున్నా సుంకాలు..

ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌లో సుంకాలు తగ్గింపు లేదా ఎత్తివేత.. భారతీయ వస్తువులపై అమెరికాలో రెసిప్రోకల్ టారిఫ్‌లు.. భారతీయ వస్తువులైన వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలపై 18 శాతం సుంకాలు.. భారతీయ ప్లాస్టిక్, రసాయనాలపై అమెరికాలో 18 శాతం టారిఫ్‌లు.. జెనరిక్ మందులు, వజ్రాలు, విమాన భాగాలపై సుంకాలు తొలగింపు..

ఉక్కు, అల్యూమినియం, రాగిపై గతంలో వేసిన సుంకాలు తొలగింపు.. అమెరికా వైద్య పరికరాలు, ఐసీటీ వస్తువులకు భారత్‌లో నిబంధనలు సడలింపు.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు చాలా మేలు.. భారత్ నుంచి ఎగుమతయ్యే స్మార్ట్ ఫోన్లపై అమెరికాలో సున్నాశాతం పన్ను.. మన రైతులకు పూర్తి రక్షణ కల్పించాం..

జీఎం ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించడం లేదు.. అమెరికా బియ్యం, గోదుమ, మాంసంపై ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు.. అమెరికాతో ట్రేడ్‌డీల్‌తో భారత వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం లేదు.. ఒప్పందం నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులకు మినహాయింపు.. వరి, సోయాబీన్, మక్కా, శనగ, రాగి వంటి ఉత్పత్తులకు అనుమతి లేదు..

డెయిరీ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి లేదు.. చీజ్, గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసరపప్పు వంటి వాటికి అనుమతి లేదు.. నాన్ ఆల్కలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తులు ఇథనాల్‌ను మినహాయించాం.. చిన్న, సూక్ష్మచిన్న పరిశ్రమలకు ఎలాంటి నష్టం కలగదు : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Piyush Goyal speaking on India-US trade deal

You cannot copy content of this page

Scroll to Top