తేదీ : 28/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో అని చూస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, భీమా కార్యాలయాలు అన్ని ఒకేచోట ఉండడంవల్ల వ్యాపార ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం భవనాలకే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.


