Ayyappa Swamy Re-Inauguration : ఫతేనగర్‌లో వైభవంగా శ్రీ సంతోషిమాత అయ్యప్ప స్వామి పునఃప్రతిష్ఠ

TRINETHRAM NEWS

ఉత్సవ ఊరేగింపు,స్వంత ఖర్చుతో మహోత్సవాన్ని ఘనతపరిచిన దాత కంచి మహేందర్

కూకట్పల్లి నవంబర్ 06 (త్రినేత్రం న్యూస్) : ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్ పరిధిలోని శ్రీ శ్రీ సంతోషిమాత అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు భాగంగా నిన్న సాయంత్రం దేవతల అలంకార రథయాత్ర ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది.ఈ మహోత్సవానికి దాతగా, నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న కంచి మహేందర్ స్వయంగా అన్ని ఏర్పాట్లను తానే భరించడం విశేషం. భక్తుల సౌకర్యం కోసం బాధ్యతను తీసుకుని ఏ విషయంలోనూ రాజీ పడకపోవడం స్థానికంగా ప్రశంసల పర్వాన్ని తెచ్చింది. డప్పులు, భజన బృందాలు, మేళ తాళ ధ్వనులతో కూడిన ఈ పర్యటనలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామికు ప్రత్యేక పూజలు చేశారు. రథంపై వివిధ అలంకార విరాజనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

వీధి వీధి భక్తులతో కిక్కిరిసిపోయింది.దేవాలయం అభివృద్ధి కోసం ఎలాంటి సహాయం అవసరమైనా ముందుండే మహేందర్ పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.“అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం చేయడం నాకు గౌరవం.”అని భావోద్వేగంగా తెలిపారు కంచి మహేందర్. జీర్ణోద్ధారణ పనులు పూర్తయ్యాక పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా మరింత వైభవంగా చేయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తి, సేవ, సనాతన సంప్రదాయాల సమ్మేళనంగా సాగిన ఈ పునఃప్రతిష్ఠ మహోత్సవ ఊరేగింపు ఫతేనగర్‌కు కొత్త ఊపునిచ్చింది. భక్తి కార్యక్రమాలలో ముందుండి ఇలాంటి సేవలు అందిస్తున్న దాత కంచి మహేందర్ సేవా తపస్పూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Santoshi Mata Ayyappa Swamy Re-Inauguration

You cannot copy content of this page

Scroll to Top