వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి హరిత రిసార్ట్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు రేపటితో ముగియనున్నాయి.
ఈ ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరై, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇరు రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొంటారు. రాహుల్ రాక నేపథ్యంలో పోలీసులు పట్టణంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


