Trinethram News : May 05, 2025, IPLలో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆయనను బీహార్ పుత్రుడిగా అభివర్ణించారు. బీహార్లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ తన వీడియో ప్రసంగంలో వైభవ్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రస్తావించారు. చిన్న వయసులోనే వైభవ్ గొప్ప రికార్డును సృష్టించాడని, దీని వెనుక చాలా కృషి ఉందని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


