ఏలూరు జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); వచ్చేనెల అనగా మార్చి . ఆ నెల పెన్షన్లను ఒకరోజు ముందుగా
అనగా ఈనెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వ తేదీన పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వె ట్రీ సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల, యాబై ఏడు వేల,ఆరు వందల యాబై ఎనిమిది మంది పింఛన్దారులకు 113.09 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో ఐదు వేల నలభై ఏడు సచివాలయ, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొంటారని అన్నారు. ఆ తేదీ నాటికి వంద శాతం పంపిణీ జరిగేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

