మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ జనవరి 29 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం పాత్లవత్ తండాకు చెందిన పాత్లవత్ కేస్లీ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
గురువారం పాత్లవత్ తండాలో కేస్లీ మృతి దేహానికి పూల మాలవేసినివాళులర్పించారు.అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కేస్లీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు. ఆయన వెంట చింతపల్లి పుల్లయ్య, పాత్లవత్ దాస్రు నాయక్, రమావత్ తులిసిరం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


