Padmasali Seva Sangam : 26న పద్మశాలీ సంఘం కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ను ఆహ్వానించిన పద్మశాలి సేవా సంఘం

TRINETHRAM NEWS

Padmasali Seva Sangam invited the MLA to the inauguration ceremony of Padmasali Sangam community building on 26th

గోదావరిఖని, జూన్ -6 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ను కలిశారు ఈ మేరకు గురువారం గాంధీ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఛాంబర్ లో ప్రత్యేకంగా పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు కలిసి మాట్లాడారు. ఈనెల 26న మార్కండేయ కాలనీలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

పద్మశాలి సంఘం ఐక్యతగా ఉంటూ సేవా కార్యక్రమంలో ముందుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న పద్మశాలి సంఘం శ్రేణులను ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారి రాజమల్లు, బూర్ల దామోదర్, పో.పా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు మాటేటి మౌనిక, యువజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాటేటి సతీష్, బొద్దుల వేణు, జిల్లా ఉపాధ్యక్షులు గుండేటి రాజేష్, యువజన గౌరవ అధ్యక్షులు గుండేటి శంకర్, కోశాధికారి తాటికొండ రవీందర్, సలహాదారులు సిరిపురం మాణిక్యం, అనుమ సత్యనారాయణ, ఆడేపు రవి, ఆడేపు దశరథం, పోరండ్ల శారద, దాసరి శ్రీనివాస్, వేముల శ్రీనివాస్, పంచాయితీ సెల్ కన్వీనర్ ఆడేపు లక్ష్మి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బండారి స్రవంతి, వెంగల శైలజ, సోడాల సంఘం అధ్యక్షులు బైరి శ్రీనివాస్, 8వ కాలనీ అధ్యక్షులు చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Padmasali Seva Sangam invited the MLA to the inauguration ceremony of Padmasali Sangam community building on 26th

You cannot copy content of this page

Scroll to Top