Natya Competitions : ఆంధ్రనాట్య పోటీలలో సీనియర్స్ జూనియర్స్ విభాగంలో గుర్తింపు స్థానాలని గెలిచుకున్న నాట్యాచార్యులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం.. స్వరనర్తన వారి అధ్వార్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటి మరియు కల్చరల్ కమిషన్ మరియు ఆంధ్రనాట్య సంగమం సంయుక్త అధ్వర్యంలో నిర్వర్తించిన ( విజయవాడ ) ఆంధ్రనాట్య పోటీలలో శ్రీ శివ సాయి కూచిపూడి మరియు ఆంధ్రనాట్య కళాక్షేత్రం నిర్వాహకులు శ్రీ తణుకు సాయి మాధవి విద్యార్ధులకు సీనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి, శ్రీ ప్రసాద్ నృత్యనికేతన్ నిర్వాహకురాలు క్షీర సాగరిక శిష్యులకు జూనియర్స్ విభాగంలో ద్వితీయ బహుమతి, కళాప్రియ నృత్య కళాక్షేత్రం నిర్వహకులు ఆచంట చంద్రశేఖర్, శిష్యులకు సీనియర్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి రాజమహేంద్రవరమునకు ఆంధ్రనాట్యానికి వైభవము కల్పించి ఈ బహుమతులను తీసుకొచ్చిరి.

అలాగే పద్మమోహన్ (స్వరనర్తన అధినేత) మరియు ఆచంట చంద్రశేఖర్ (పేరిణి) మాస్టారు, పిల్లలకు నాట్యము నందు క్రుషి చేయమని సలహా ఇచ్చిరి. వీరు రాజమహేంద్రమునకు యనలేని కీర్తి దక్కించురని పవిత్ర హిందూ ధర్మ మూలాలకు చిరంజీవులు అభి, కిరణ్మయి , తేజ, హాసిని, ఐశ్వర్యలు మార్గదర్శకులుగా నిలుస్తారు అని హిందూ ధర్మ రక్షణ కమిటీ నిర్వాహకులు ( హెచ్ డీ ఆర్ ఎస్) ప్రతిభను కోని ఆడారు,

ఆకుల మణికాంత్,
హిందూ ధర్మరక్షణ కమిటీ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Natyacharyas who won recognition places in the seniors and juniors categories

You cannot copy content of this page

Scroll to Top