Mon. Mar 9th, 2026

MLA and Daughter Samhita : శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , కుమార్తె సంహిత రెడ్డి.

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 26 :నెల్లూరు జిల్లా: కొండ బిట్రగుంట..

బోగోలు మండలం: కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి , బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో ప్రకాశిల్లుతూ, భక్తుల రద్దీతో కళకళలాడింది.

ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి కుమార్తె (సంహిత రెడ్డి )స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఆలయ నిర్వాహకులను ఆమె అభినందించారు.శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు గోవిందా,గోవిందా నామస్మరణలతో మారుమోగాయి.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన సంహిత రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, కొండ బిట్రగుంటలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు విశేషమైన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ, అధికారులు, సేవా సిబ్బందిని అభినందించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం అభినందనీయం అన్నారు..ఉత్సవాల కాలంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు.భక్తి, ఆధ్యాత్మికత, ఆనందోత్సాహాలతో కొండ బిట్రగుంటలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kavya Krishna Reddy and daughter Samhita Reddy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page