MLA Balu Naik : నియోజకవర్గంలోనిపలువురు భౌతిక కాయాలకు నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలు నాయక్

TRINETHRAM NEWS

దేవరకొండ జూలై 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని 17వ వార్డు సంతోషిమాత కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అంకూరి జ్ఞాణయ్య మరణించిన విషయం తెలుసుకొని నేడు దేవరకొండ పట్టణంలోని వారి స్వగృహంలో అంకురి జ్ఞాణయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి,బాధిత కుటుంబానికి పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామానికి చెందిన విక్రమ చారి విద్యుత్ షాక్ తో మరణించిన విషయం తెలుసుకొని నేడు దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకొని విక్రమ చారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

వారితో పాటు పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యునూస్,నాయకులు సుగుణయ్య,మురళి కృష్ణ, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Balu Naik paid

You cannot copy content of this page

Scroll to Top