మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాలేరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ గా నియమితులైన బోళ్ళ గోవిందరాజు శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు పిఎసిఎస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా చైర్మన్, మెంబర్లు గా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే వేగుళ్ళ దుశ్శాలువాతో సత్కరించారు. మెంబర్లు గా కురుపూడి శ్రీను, దాసరి శ్రీను లు నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో గుణ్ణం సత్యనారాయణ, వల్లూరి సతీష్, బోళ్ల రమేష్, రిమ్మలపూడి అమ్మిరాజు, బండారు వీరబాబు, బొడ్డు కాశీ విశ్వేశ్వరరావు, అంగర రమణయ్య, దాసరి సుబ్రహ్మణ్యం, పుట్టా చంద్రకిరణ్, బొజ్జా సాయి ప్రకాష్, తదితర్లు పాల్గొన్నరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


