Indiramma House : జనుముల నరసయ్యకు ఇందిరమ్మ ఇల్లు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :స్మశాన వాటికలో నివవిస్తున్న నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే పరిగి పట్టణంలోని గంగపుత్ర స్మశాన వాటికలో గత కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న జనుముల.నరసయ్య S/o బీమాప తన మనవడితో కలిసి గంగపుత్ర స్మశాన వాటికలో నివాసం ఉంటున్నారు.

ఈ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న పరిగి ఎమ్మెల్యే డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నరసయ్యని పిలిపించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వెంటనే కలెక్టర్ తో మాట్లాడి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.వారికి అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indiramma house for Janumula Narasaiah

You cannot copy content of this page

Scroll to Top