Mukunda Nageshwar : ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయొద్దని ఎత్తుకెళ్లి మూత్రం తాగించడం హేయమైన సభ్య సమాజం తలదించుకొనే చర్య

TRINETHRAM NEWS

ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి… ముకుంద నాగేశ్వర్, టిజేఏసీ చైర్మన్, వికారాబాద్… ఒక వర్గం పెత్తనం అధికార మదంతో పరాకాష్టకు చేరితే ఇటువంటి సంఘటనలే జరుగుతాయి కావున ప్రజలు అప్రమత్తమై ప్రలోభాలకు లోను కాకుండా ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల అందరిపై ఉంది

ప్రభుత్వం మెజారిటీ ప్రజల హక్కులను కాపాడడంలో భాగంగా చర్యలు తీసుకోకపోతే చర్యకు ప్రతిచర్యగా ఊరందరూ ప్రతిరోజు వాళ్లకు ఉచ్చ తాగించండి… బీసీ ప్రజలారా మేల్కోండి… రాజ్యాధికారానికి రాని జాతులు అవమానాలకు గురవుతాయి అంతరించిపోతాయి… బీసీ సోదరులారా అన్ని బీసీ రిజర్వుడు మరియు రిజర్వేషన్ లేని స్థానాలలో పార్టీల మద్దతు ఉంటే పార్టీల పరంగా లేని పక్షంలో పార్టీలకు అతీతంగా నామినేషన్ వేయండి, బీసీ అభ్యర్థులకు ఓట్లు వేసుకోండి విజయం సాధించండి.

ఐదేళ్లు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించండి…. లేకపోతే ఉచ్చ తాగించినా మా వర్గానికి ఓట్లు వేసి గెలిపించారని ప్రతి గ్రామంలో ఉచ్చ తాగించేవాళ్లు తయారైతరు కావున మెజారిటీ ప్రజల హక్కులను ఓటు ద్వారా సాధించుకుందాం… సిగ్గు శరం వదిలేసి ఓటుకు నోటు మరియు క్వార్టర్ కోసం ఉచ్చ తాగించే వర్గాలకు ఓటేసి బానిసత్వంలోకి వెళ్తారో లేక తమ ఓటు తాము వేసుకుని గెలిచి ఆత్మగౌరవంతో జీవిస్తారో ఆలోచించండి

ముకుంద నాగేశ్వర్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

In a democratic system, drinking urine to prevent nomination

You cannot copy content of this page

Scroll to Top