దేవరకొండ డివిజన్ మార్చ్ 03, త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఈరోజు హోలీ సంబరాలు ఘనంగా సభ్యులు జరుపుకున్నారు. చిన్నారులు పెద్దలు కుల మత చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎన్ వీ టీ మాట్లాడుతూ శీతాకాలం ముగిసి ప్రకృతి రంగు రంగుల పూలతో కళకళలాడే వసంత రుతువు ప్రారంభానికి సంకేతంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారని. ముఖ్యంగా ఈ హోలీ పండుగను సామాజిక ఐక్యతకు నిదర్శనంగా భావిస్తారు.
కుల మత, వర్గ భేదాలు లేకుండా ఆనందంతో ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉల్లాసంగా ఈ పండుగను జరుపుకుంటారు.రాక్షసి హోలిక అగ్నిలో దహనమైన కథను గుర్తుచేస్తూ, చెడు గుణాలను దహనం చేయడానికి హోలికా దహనం చేస్తారు.ఇది పాత విభేదాలను తొలగించి, కొత్త స్నేహాన్ని, ప్రేమను పెంపొందిస్తుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో కే పంతుల నాయక్ , ఎస్ బి ఐ సర్వీస్ మేనేజర్ ఎన్ వెంకట్రాం, కరాట మాస్టర్ గోపి, తాళ్ల సురేష్, ఎన్ పూర్యా నాయక్, రాజు, రతన్, కేశవ్, జమీర్, పొట్ట మధు, చిన్నారులు క్రీడాకారులు కళాకారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


