కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 14 : హైదర్ నగర్ డివిజన్ శ్రీనివాస కాలనీ లోని బి ఎం ఆర్ రెసిడెన్సీలో హోలీ సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగను చిన్న, పెద్ద అందరు కలిసి రంగులు చల్లుకుంటూ సంబురంగా గడిపారు. డీజే పాటలు సంస్కృతిగా నృత్యాలతో వేడుకలు అధ్యంతం అంబరాన్ని అంటాయి.
మధ్యాహ్నం అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమం లో అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్ నాయక్,మురారి, శ్రీనివాస్, ఆకుల వాసు, సుమన్ బాబూ, శ్రీహరి, విష్ణువర్ధన్ రెడ్డి చైతన్య కుమార్ రెడ్డి, నాగరాజు, గోపి కృష్ణ రెడ్డి, రమేష్ ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


