టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఫైనల్ లిస్టు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి:మార్చి 29
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ-జన సేన-బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపు తోంది.

ఇప్పటి వరకూ టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య ర్థులను ప్రకటించగా.. ఈరోజు పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది.

ఇందులో ఇప్పటి వరకూ ఉన్న సీనియర్లు, నియోజ కవర్గాల మార్పులు, చేర్పులు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించడం జరిగింది.

తెదేపా 9 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది

అసెంబ్లీ అభ్యర్థులు:

చీపురుపల్లి- కళా వెంకట్రావు, భీమిలి గంటా
శ్రీనివాసరావు, పాడేరు-వెంకటరమేశ్నాయుడు, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట-
సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు-వీరభద్రగౌడ్, గుంతకల్లు-గుమ్మనూరు జయరామ్,
అనంతపురం అర్బన్- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి- కందికుంట వెంకట
ప్రసాద్.

లోక్ స‌భ అభ్యర్థులు:

విజయనగరం-కలిశెట్టి అప్పలనాయుడు, ఒంగోలు-
మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కడప-భూపేశ్ రెడ్డి, అనంతపురం – అంబికా
లక్ష్మీనారాయణ…

You cannot copy content of this page

Scroll to Top