రాజకీయంగా కరెక్టుగా ఉండాలనే తాపత్రయమే వారి బలహీనతన్న ట్రంప్
వలసల విధానం మారకపోతే ఆ దేశాలు నిలబడలేవని హెచ్చరిక
ఉక్రెయిన్ సంక్షోభంపై యూరప్ నేతలు విఫలమయ్యారని ఆరోపణ
Trinethram News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై, వాటి నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్ను ‘బలహీన’మైన నాయకులు పాలిస్తున్నారని, దానివల్ల ఆ దేశాలు బలహీనపడుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. పొలిటికో వార్తాసంస్థకు వైట్హౌస్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“యూరప్ నేతలు బలహీనులని నేను భావిస్తున్నాను. వారు ఎప్పుడూ రాజకీయంగా కరెక్టుగా ఉండాలని చూస్తుంటారు. ఏం చేయాలో కూడా వారికి తెలియదు” అని ట్రంప్ అన్నారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా నుంచి వస్తున్న వలసల కారణంగా లండన్, పారిస్ వంటి నగరాలు తీవ్రమైన భారంతో కుంగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సరిహద్దు విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో కొన్ని యూరప్ దేశాలు నిలబడలేని పరిస్థితికి వస్తాయని హెచ్చరించారు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో యూరప్ నేతల పాత్రపై తనకు నమ్మకం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. “వారు కేవలం మాట్లాడతారు, కానీ ఫలితాలు తీసుకురారు. యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది” అని విమర్శించారు. ఉక్రెయిన్తో పోలిస్తే రష్యా బలమైన స్థితిలో ఉందని చెబుతూ, ఉక్రెయిన్లో కొత్తగా ఎన్నికలు జరపాలన్న తన పిలుపును పునరుద్ఘాటించారు.
ఇటీవల అమెరికా విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహంలో కూడా యూరప్లో వలసలు, ఇతర రాజకీయ అంశాలపై ప్రతిఘటనను ప్రోత్సహిస్తామని పేర్కొనడం గమనార్హం. దీనిపై యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా స్పందిస్తూ “మిత్రదేశాల అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని బెదిరించకూడదు” అని బదులిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


