త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 20, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట పొలాలకు పిచికారి చేసే డ్రోన్ లు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పాల్గొని రైతులకు డ్రోన్స్ ను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మండపేట మండలానికి సంబంధించి 3 డ్రోన్లు పంపిణీ చేశామన్నారు. వీటి ఖరీదు రూ.29,40,000/-లు కాగా ప్రభుత్వం సబ్సిడిగా రూ.23,52,000/-లు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, మండపేట పిఎసిఎస్ చైర్మన్ కుక్కల రామారావు, టేకి పిఎసిఎస్ చైర్మన్ మేడిశెట్టి శ్రీనివాస్, ఎండిఓ కె.సత్యనారాయణ, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


