దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ చైర్మన్ పున్నా శైలజ వెంకటేష్, వైస్ చైర్మన్ తబస్సుమ్ మరియు కౌన్సిలర్లను ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పున్న శైలజా వెంకటేష్ మాట్లాడుతూ… బీసీ సంఘం బలోపేతం చేయడానికి, మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేస్తానని తెలిపారు.
నజీర్ మాట్లాడుతూ బీసీ సంఘం బలోపేతం కోసం ఉద్యమాలను ఉదృతం చేయడానికి ముందుంటానని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో సామాజికవేత్త బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించబడింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 20 మంది వార్డు కౌన్సిలర్లు అందరూ వార్డులలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించి వార్డు సభ్యులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి రెడ్డి కోటేశ్వరరావు ఎం.డి రంజాన్ బేగ్ కొండపల్లి శ్రీను వరికుప్పల శ్రీను కూరెళ్ళ కృష్ణమాచారి పున్న వెంకటేష్ నేత, మెరుగు శీను, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


