
CM Chandrababu : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 06; మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్, ఇన్ ఛార్జ్ ల శిక్షణ తరగతులు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆ పార్టీ కోసం అహర్నిశ ల శ్రమించే కార్యకర్తలను భవిష్యత్తు నాయకులుగా తీర్చి దిద్దుతామని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులకు, నాయకులకు సహనం, ఓపిక అవసరమని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాలన నియోజకవర్గాలలో నేతల పనితీరుపై అంతర్గత సర్వేలు చేస్తున్నామని , అధికార బలంతో తప్పులు చేస్తే సొంత పార్టీ నుంచి అయినా సరే వదిలించుకోవడానికి వెనకాడబోమని చంద్రబాబు హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe