ఆటో డ్రైవర్ల సేవలో వాహన మిత్ర, పథకం ప్రారంభం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర పథకంలో భాగంగా డ్రైవర్ల ఖాతాలో ఒక్కొక ఏడాదికి రూ 15000/- చొప్పున పడుతున్న శుభ సందర్భంగా మురమండ అభయ ఆంజనేయ ఆటో యూనియన్ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవళ్ళ రామ్మోహన్రావు (రాంబాబు), తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి,గ్రామ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ పల్లి సురేష్, సొసైటీ చైర్మనవట్టికూటి జానకిరామయ్య, నీటి అధ్యక్షుడు గన్ని రామారావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేలు పూరి వెంకటేష్, మిద్దె గోపి వాహన మిత్ర లబ్ధిదారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


