
Center orders Companies : త్రినేత్రం న్యూస్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇందులోభాగంగా దేశంలోని చమురు, గ్యాస్ కంపెనీలకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వాటి వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయాలని ఆదేశించింది.
ప్రజాప్రయోజనాలను దృష్టిపెట్టుకొని పెట్రోల్, సహజవాయువు సరఫరా గొలుసును పర్యవేక్షించేందుకు ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేసే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC)కు కంపెనీలు ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

