విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి…
జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా కుప్పకూలిన విమానం
ప్రమాదంలో విమానంలో ఉన్న ఆరుగురు మృతి చెందినట్లు నిర్ధారించిన డీజీసీఏ
Trinethram News : ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన (Aircraft Crash in Maharashtra) చోటుచేసుకుంది.
సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


