Trinethram News : కైలాశ్ మానసరోవర యాత్రను త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా విమానాల పునరుద్ధరణకు భారత్, చైనా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వివరించారు. త్వరలో యాత్రపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల కారణంగా 2020 నుంచి ఈ మానస సరోవర యాత్ర ఆగిపోయింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


