Trinethram News : మంగళగిరి : ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు చేపట్టింది. మొత్తం 534 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వినతులకు స్పందించిన ఆర్థికశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుల భర్తీకి సహకరించిన నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాకు మంత్రి పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


