Arava Sridhar’s Interrogation Completed : అరవ శ్రీధర్ విచారణ పూర్తి… కేసు నమోదు

TRINETHRAM NEWS

Trinethram News : జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అరవ శ్రీధర్ ను సదరు మహిళ పాతిక కోట్ల రూపాయలు డిమాండ్ చేసి బెదిరించిందని ఆరోపణలు వస్తున్నాయి.

ఓ మహిళ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసినా అరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయలేదని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అరవ శ్రీధర్ పై కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు, అరవ శ్రీధర్ పై సదరు మహిళ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు జనసేన నేతలతో జనసేన పార్టీ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. రైల్వేకోడూరులోని ఓ హోటల్‌ లో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలను కమిటీ సేకరించింది.

అయితే, విచారణ మధ్యలోనే శ్రీధర్‌ బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత మీడియాకు పూర్తి సమాచారం ఇస్తానని చెప్పిన శ్రీధర్..ఆ తర్వాత బయటకు వెళ్తూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తర్వాత వివరణ ఇస్తానని, తన వివరణను కమిటీకి వివరించానని మీడియాతో శ్రీధర్ అన్నారట.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Arava Sridhar's interrogation completed… case registered

You cannot copy content of this page