మండపేట లో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర…
త్రినేత్రం న్యూస్… మండపేట… పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పురపాలక సంఘం కమీషనర్ టివి రంగారావు ఆధ్వర్యంలో శనివారం మున్సిపాల్టీ వద్ద స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, వైస్ చైర్మన్ పిల్లి గణేష్, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇబ్రహీం, బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, కొవ్వాడ అప్పన్న బాబు, పెదపాటి సత్తిబాబు, జొన్నపల్లి సూర్యారావు, టేకి వెంకటేష్, కౌన్సిలర్ లు, అర్ ఓ శాస్త్రి, అర్ ఐ అందే శ్రీనివాస్, సి ఎం ఎం పి సుజాత, శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు, డి ఇ కింతాడ శ్రీనివాస్, ఏ ఈ లు దాసరి పవన్ , అనూష, అర్ పి లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


