తేదీ : 29/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట మండలం లో ప్రజా పరిషత్ కార్యాలయం నందు డైనమిక్ శాసనసభ్యులు కొలిక పూడి శ్రీనివాసరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. రెవెన్యూ, భూమి అక్రమణలు, పోలీస్ శాఖకు సంబంధించి సమస్యలు మరియు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, కాలనీ ఇళ్ళు, ఇలా పలు రకాల సమస్యలతో దాదాపుగా మూడు వందల మంది శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేశారు.
అక్కడికక్కడే సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ సమస్యలకు పరిష్కారం చేశారు. మరికొన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు సమస్యల విషయంపై అన్నిటిని పరిశీలించి త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మండలంలోని అన్ని శాఖ అధికారులు ప్రజల పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


