రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

TRINETHRAM NEWS

CM Revanth Reddy: రేవంత్‌ను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్

హైదరాబాద్: గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై రేవంత్‌తో చంద్రశేఖర్‌ చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు..

తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ వివరించినట్టుగా తెలుస్తోంది. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top