TRINETHRAM NEWS

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం

తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది.

రేపు తెల్లవారుజామున 1:45 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకోనుండగా రేపటి టికెట్స్ ఉన్న వారిని ఈ రోజు సాయంత్రం క్యూలైన్లలో అనుమతించనున్నారు.

రేపటి నుంచి జనవరి 1 వరకు రోజుకు 80వేల మందిని వైకుంఠ ద్వారం ద్వారా టీటీడీ వారు దర్శనం కల్పించనున్నారు