ప్రచురణార్థం ప్రొద్దుటూరు, తేదీ:09:04:2025 – అంబేద్కర్ సేన ఆల్ ఇండియా సెక్రటరీ రెడ్డి మల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్బీ.సాగర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా ఎన్బీ సాగర్ మాట్లాడుతూ, అంబేద్కర్ సేనను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించినందుకు ఆల్ ఇండియా సెక్రటరీ రెడ్డి మల్ల శ్రీనివాస్ కి, రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ సేన అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం ప్రతి స్థాయిలో పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


