మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో సమావేశం జరిగింది
ఈ సమావేషానికి హాజరైన జోనల్ కో ఆర్డినేటర్ కాదాసి రవీందర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు, జోనల్ కో ఆర్డినేటర్ కాదశి రవీందర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో, పార్టీని మరింత బలోపేతం చేసే క్రమంలో భాగంగా నాగుల కిరణ్ బాబు కి మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి నారాయణ గౌడ్ బహుజన్ సమాజ్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కుమ్మరి కృష్ణ చైతన్య, బచ్చలి లింగయ్య, నాగుల అనిల్ బాబు, మధుబాబు, శ్రీకాంత్, మల్లేష్, రాజేష్ తదితరులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


