లడఖ్‌లో వేలాదిమంది ఆందోళన.. కారణమిదే!

TRINETHRAM NEWS

Trinethram News : Ladakh

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో వేలాది మంది భారతీయులు(indians) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.

రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలతో లడఖ్‌(Ladakh) మొత్తం స్తంభించిపోయింది. లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్(sonam vanguchug) కూడా మద్దతు తెలిపారు.

కాగా, లడఖ్‌ కు రాష్ట్ర హోదాతో పాటు భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ ప్రకారం రాజ్యాంగ రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. దీని కోసమే ఆందోళనలు చేపడుతున్నారు. లడఖ్‌ కు రాష్ట్ర హోదా కేటాయించడంతోపాటు లేహ్, కార్గిల్‌ జిల్లాలకు ప్రత్యేక పార్లమెంటు స్థానాలను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top