గుంటూరు జిల్లా : అమరావతి : జనవరి 10: (త్రినేత్రం న్యూస్); గత ప్రభుత్వం పాలకులు రెండు వేల ఇరవై వ సంవత్సరంలో నిలిపివేసినటువంటి రాయలసీమ లిఫ్టుతో స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూపాయలు తొమ్మిది వందల కోట్లు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.
నీటి విషయంలో రాజీ పడేదే లేదు అని టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్పష్టం చేశారు. నీటి విషయంలో గొడవలకు దిగితే మాత్రం నష్టపోయేది తెలుగు ప్రజలేన ని ఆయన అన్నారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


