త్రినేత్రం న్యూస్. 03.10.2025 – శుక్రవారం. పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కచ్చితంగా గుర్తింపు ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటడమే మన ఏకైక లక్ష్యం అశ్వారావుపేట మండలం వినాయకపురం, చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ముందున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించేందుకు విధివిధానాల గురించి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ బలాన్ని గ్రామ స్థాయి నుంచి మరింతగా పెంపొందించుకోవాలని కార్యకర్తలందరూ సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


