దేవరకొండ అక్టోబర్ 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ రెస్టారెంట్,లాడ్జినీ నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రీన్ రెస్టారెంట్,లాడ్జి యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.నాణ్యమైన ఆహారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని గ్రీన్ రెస్టారెంట్ యజమాన్యం శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతపల్లి సుభాష్, యువజన విభాగం కొండమల్లెపల్లి మండల అధ్యక్షుడు రమావత్ తులసిరామ్, శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


