పాలకుర్తి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్యశ్రీ తో పాటు ఖర్చు ఎక్కువ అయినట్లయితే ఎల్ ఓ సి ఇస్తున్నాం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ బసంత్ నగర్ లో మెగా వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు అలాగే సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించారు. అదేవిధంగా పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అంతే కాకుండా వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆస్పత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు ఆరోగ్య విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఈ శిబిరంలో వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీష్ పబ్బా, రాజశేఖర రెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపికాంత్ తదితరులున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


